Saturday, May 4, 2024

Nalgonda : రోడ్డు ప్రమాదం.. దంపతులు దుర్మరణం

నల్గొండ జిల్లా, సెప్టెంబర్ 19 : నల్గొండ జిల్లా పాన‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన దంపతులు మృత్యువాతపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులు స్పాట్‌లోనే మృతిచెందారు. పానగల్ లో ఉదయ సముద్రం ప్రాజెక్టు దిగువన దంపతులు ఓర్సు విష్ణు, స్వప్న ఈ ఉదయం రోజు మాదిరే మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. అయితే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి బలంగా దంపతులను ఢీకొట్టింది.

తీవ్ర గాయాలపాలైన దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లులు ఉండగా.. ఆయన విష్ణు ఎన్జీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఒకే ప్రమాదంలో దంపతులు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement