Friday, May 3, 2024

Revanth Reddy – నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ – పోటీ పరీక్ష‌ల వ‌యో ప‌రిమితి పెంపు

హైద‌రాబాద్ – తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్తలు వినిపించారు . ఇప్పటికే మరో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన‌ గ్రూపు-1 నోటిఫికేషన్ పైనా స్పష్టత ఇచ్చారు. అతి త్వరలో పెంచిన పోస్టులతో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇస్తామని శుక్రవారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. గ్రూపు-1 అభ్యర్థుల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందని అన్నారు. కాగా, మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement