Friday, May 3, 2024

AP: వర్సిటీలకు నిధులు ఇవ్వండి.. యూజీసీ చైర్మన్ కు తిరుపతి ఎంపి విజ్ఞప్తి

తిరుపతి (రాయలసీమ బ్యూరో, ప్రభన్యూస్) : రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న పలు యూనివర్సిటీల సమస్యలను పరిష్కరించాలని తిరుపతి లోక్ సభ సభ్యుడు మద్దెల గురుమూర్తి యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం (యూజీసీ) చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.

శుక్ర‌వారం ఢిల్లీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెస‌ర్ మామిడాల జగదీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాత్రమే రాష్ట్రంలో ఏకైక మహిళా విశ్వవిద్యాలయం అని.. 12వ ప్రణాళిక కింద యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ విడుదల చేయాల్సిన గ్రాంట్ మొత్తం.రూ.1,50,53,098 ఇంత వరకు విడుదల చేయలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement