Sunday, April 28, 2024

Revanth Reddy:నేడు నాలుగు ఎన్నిక‌ల స‌భ‌ల‌లో రేవంత్ రెడ్డి ప్ర‌చారం

ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ , అదే రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ల‌లో పాల్గొంటున్నారు. ఈరోజు కూడా రేవంత్ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నరసపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో జరిగే బహిరంగ సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సాపూర్, 3 గంటలకు పరకాల, సాయంత్రం 6 గంటలకు ఖైరతాబాద్, రాత్రి 8 గంటలకు నాంపల్లిలో జరిగే రోడ్ షోలు, సభల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement