Monday, April 29, 2024

రేవంత్ రెడ్డిపై రేగా కాంతారావు ఫైర్

పినపాక – తాను 300 ఎకరాలు అక్రమంగా సంపాదించానని నిరూపిస్తే మణుగూరు చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని, లేదంటే రేవంత్‌రెడ్డి ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సవాల్‌ విసిరారు. రేవంత్‌ తనపై విడుదల చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్న ఏ ఒక్కదాన్ని నిరూపించానా తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు తిట్ల పురాణంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. తిట్లతో అధికారం రాలేమనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని సెలవిచ్చారు. రేవంత్‌రెడ్డి తన కులాన్ని, జాతిని అవమానించారని చెప్పారు. రేవంత్‌ గాలి మాటలు బంద్‌ చేయాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాము తలచుకుంటే రేవంత్‌ తన నియోజకవర్గంలోనే పాదయాత్ర చేసేవాడే కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement