Monday, April 29, 2024

బాసర ట్రిపుల్ ఐటీకి తగ్గిన దరఖాస్తులు…

తెలంగాణలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన బాసర ట్రిపుల్ ఐటిలో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఈ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం విద్యార్థులు తీవ్రంగా పోటీపడేవారు. ఇటీవల విద్యార్థుల వరుస మరణాలతో యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారిపోయింది.

ఇలా అనేక రకాల కారణాల నేపథ్యంలో తమ పిల్లలను బాసర ట్రిపుల్ ఐటిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు.1,605 సీట్లకు 13,538 విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది 33వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి అందులో సగం దరఖాస్తులు కూడా రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement