Monday, April 29, 2024

Ready to Join – రాహుల్ గాంధీతో పొంగులేటి, జూప‌ల్లి భేటి…

న్యూఢిల్లీ – కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ద‌మైన ఖ‌మ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావులు నేడు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో భేటి అయ్యారు.. రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను వారు రాహుల్ గాంధీకి వివ‌రించారు.. అలాగే పార్టీ చేరిక విష‌యం గురించి త‌మ మ‌న‌సులోని భావాల‌ను వారు రాహుల్ గాంధీకి వివ‌రించిన‌ట్లు స‌మాచారం.. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

కాగా,అంత‌కుముందు తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మానిక్ రావు థాక్రే మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి, జూప‌ల్లి ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే త‌మ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. అలానే ఖ‌మ్మం మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఫైర్ బ్రాండ్ రేణుక చౌద‌రి మాట్లాడుతూ పొంగులేటి,జూపల్లి చేరిక‌ను స్వాగ‌తిస్తున్నాన‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement