Sunday, April 28, 2024

RR: ఆడపడుచులకు అండగా ఉంటా.. వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, ఆగస్టు 31, ప్రభ న్యూస్ : షాద్ నగర్ నియోజక వర్గంలో ఆడపడుచులకు అన్నయ్యగా అండగా ఉంటానని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వీర్లపల్లి శంకర్ నివాసంలో ఆరు మండలాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు తదితర మహిళా కార్యకర్తలు శంకర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి, చౌదరిగుడా మహిళా అధ్యక్షురాలు పిట్ట రజిత, కేశంపేట్ మహిళా అధ్యక్షురాలు అనసూయ, కొందుర్గు మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ, నందిగామ మండల అధ్యక్షురాలు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement