Sunday, April 28, 2024

బ్రతుకుదెరువు కోసం వచ్చి.. ఆర్టీసీ బస్సులో మృతి

జవహర్ నగర్ : మంగళవారం జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో (ఆర్టీసీ) బస్సులో ప్రయాణం చేస్తూ అనూప్ తివారి (27) అనే వ్య‌క్తి మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్ వాసి….నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి హైటెక్ సిటీలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జవహార్ నగర్ చర్చ్ మల్కారంలో ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లే క్రమంలో బస్సు ఎక్కిన తివారి, బస్సు బాలాజీ నగర్ రాగానే ఒక్కసారిగా బస్సులో కుప్ప కూలాడు తివారీ. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ కలిసి తివారీని సమీపంలో గల మీనాక్షి హాస్పిటల్ కి తీసుకువెళ్లగా డ్యూటీ డాక్టర్ తివారీ మరణించినట్లు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుని బంధువులు, కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement