Friday, April 19, 2024

రంగారెడ్డి జిల్లాలో టెన్త్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లోని చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నేనావత్ జీవన్ అనే విద్యార్థి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఉదయం రూం నుంచి బయటకు రాకపోవడంతో గదికి వెళ్లిచూడగా.. ఉరివేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడు జీవన్ స్వస్థలం ఆమన్గల్ మండలం నుచుకుంట తండా. అయితే కొడుకు మృతి విషయం తల్లిదండ్రులకు చెప్పకుండానే మృతదేహాన్ని హాస్టల్ నుంచి తరలించడం వివాదాస్పదమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement