Tuesday, March 26, 2024

ఏపీలో బీఆర్ఎస్‌ పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి : ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని ఏపీ నాయ‌కుల‌కు చెన్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాయకత్వం వహించే నాయకులు ఈరోజు హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీఆర్ఎస్ నేత‌ బాల్క సుమన్ ను క‌లిశారు. రాబోవు రోజుల్లో పార్టీ అనుసరించే విషయలు చర్చించారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం చేయాల‌న్నారు. ఇందుకు కావాల్సి స‌హాయ క‌హ‌కారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. గ్రౌండ్ లెవ‌ల్ నుంచి పార్టీ బ‌లోపేతం కావాల‌న్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు సూరిబా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement