Saturday, April 27, 2024

సిద్దిపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న మార్నింగ్ వాక్ కు వెళ్లిన జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశం హత్యకు గురైన సంగతి తెలిసిందే. జెడ్పీటీసీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణ, చంద్రకాంత్ ఇళ్లపై దాడి జరిగింది. నిందితుల ఇళ్లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. నిరసన‌కారుల దాడుల్లో ఇంటి అద్దాలతో పాటు కారు, ట్రాక్టర్లు ధ్వంసమయ్యాయి. నిందితుల‌ను అరెస్ట్ చేయాలంటూ ఆందోళ‌న‌ల కారులు నిర‌స‌న చేప‌ట్టారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement