Monday, April 29, 2024

శంకర్​పల్లి తహసీల్దార్ గా సురేందర్ .. బాధ్యతల స్వీకరణ

శంకర్ పల్లి (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల నూతన త‌హ‌సీల్దార్ గా సురేంద‌ర్ ఇవ్వాల (గురువారం) బాధ్యతలు స్వీక‌రించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి బదిలీపై శంకర్ పల్లి కి వచ్చారు. గతంలో శంకర్‌ప‌ల్లి లో పనిచేసిన త‌హ‌సీల్దార్ నయీముద్దీన్ హైదరాబాద్‌ జిల్లాకు బదిలీపై వెళ్లారు. నూతనంగా బదిలీపై వచ్చిన త‌హ‌సీల్దార్ సురేందర్ కు డిప్యూటీ త‌హ‌సీల్దార్ ప్రియాంక పూల బొకే ఇచ్చి స్వాగతం ప‌లికారు. కార్యక్రమంలో ఆర్ ఐ విక్రమ్, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పవన్ కళ్యాణ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement