Friday, May 3, 2024

RR : మాజీ మంత్రి ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన సుభాష్ నగర్ వాసులు

వికారాబాద్, నవంబర్ 10 ( ప్రభ న్యూస్): బడుగు బలహీనవర్గాలు అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ తో నే సాధ్యమని మాజీమంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీమంత్రి ప్రసాద్ కుమార్ నివాసం వద్ద వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మజులా రమేష్ వికార పట్న, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని రాబోయే శాసన ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ మాట్లాడుతూ గతంలో చేపట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement