Monday, April 29, 2024

RR: బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ఎస్పీ కోటిరెడ్డి పూజలు

వికారాబాద్ మార్చి 8 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్పి కోటిరెడ్డి దంపతులచే శ్రీ రామలింగేశ్వరునికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ… మహాశివరాత్రి అందరికీ పర్వదినమని జిల్లాలోని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement