Monday, May 6, 2024

RR: స్కాలర్ షిప్ చెల్లించాలని మేడ్చల్ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా

ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్, ఆగస్ట్ 21: విద్యారంగ అభివృద్ధి, సంక్షేమ వసతి గృహాల సమస్యల పరిష్కారానికి రూ.5,177 కోట్ల స్కాలర్ షిప్, ఫీజ్ రీఇంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమస్యల సాధనలో భాగంగా ఇవాళ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాను నిర్వహించారు.

ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీస్ లు అరెస్ట్ చేశారు. అనంతరం విడుదల చేశారు. అనంతరం ఎస్.ఎఫ్. ఐ జిల్లా ప్రధాన రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ… విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనియెడల ప్రగతి భవన్ ముట్టడి చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్, చెంద్ర కాంత్, కిరణ్, అరుణ్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement