Monday, May 6, 2024

కేంద్రం తీరును ఎండగట్టిన మంత్రి సబితారెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితారెడ్డి కేంద్రం తీరును ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా మహేశ్వరం మండల కేంద్రంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్క‌ర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా నిర్వ‌హించారు. ఈ ధ‌ర్నాలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక భావమున్న కేంద్ర ప్రభుత్వం నశించాలన్నారు. రైతులను తప్పుదోవ పట్టించిన బీజేపీ పార్టీ రాష్ట్ర నేతల తీరును ఎండగడుతూ భారీ ధర్నా కొనసాగుతుందన్నారు. పంజాబ్ మాదిరిగానే రెండు పంటలు కొనాలని డిమాండ్ చేస్తూ…గల్లీ నుండి ఢిల్లీ వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా మన రైతు నష్టపోవొద్దని ఆందోళన కార్యక్రమాలకు పిలుపుతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టినట్లు మంత్రి సబితా రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement