Monday, April 29, 2024

RR: గుంతలమయంగా వికారాబాద్-సదాశివపేట రోడ్డు.. పట్టించుకోని అధికారులు

వికారాబాద్, అక్టోబర్ 12 (ప్రభ న్యూస్): వికారాబాద్ సదాశివపేట మార్గంలో కొత్తగాడి అనంతరం బ్రిడ్జి వద్ద రోడ్డు మొత్తం దెబ్బతిని గుంతలమయంగా మారినప్పటికీ గత కొంతకాలంగా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా ఎన్నో వాహనాలు దెబ్బతీయడంతో పాటు ద్విచక్ర వాహనదారులు గాయాలపాలవుతున్నారు. ఈ విషయంలో అధికారులు ఈనాడు స్పందించిన దాఖలు లేవు.

గతంలో ఈ రోడ్డు వేసి దాదాపు ఐదు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు ఏ ఒక్కరూ స్పందించిన దాఖలాలు లేవు. వికారాబాద్-సదాశివపేట ప్రధాన మార్గంలో రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement