Sunday, May 5, 2024

మర్రి రాజశేఖర్‌ రెడ్డిని కలిసిన విద్యుత్‌ కంట్రోల్‌ నాయకులు..

మేడ్చల్‌ : మేడ్చల్‌ – మల్కాజిగిరి పార్లమెంటు తెరాస ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డిని విద్యుత్‌ కంట్రోల్‌ సిస్టిమ్స్‌ యూనియన్‌ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.నగరంలోని రాజశేఖర్‌రెడ్డి నివాస కార్యాలయానికి టిఆర్‌ఎస్‌ కేవి మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌ ఆధ్వర్యంలో మేడ్చల్‌ పారిశ్రామిక వాడలోని విద్యుత్‌ కంట్రోల్‌ సిస్టిమ్స్‌ యూనియన్‌ కలిసినట్లు తెలిపారు. అనంతరం ఆయనను కలిసిన విద్యుత్‌ యూనియన్‌ సభయులు శాలువాతో సత్కరించి పూలబొకే అందించి హోలి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయనను కలిసి విద్యుత్‌ యూనియన్‌ సభ్యులు శాలువాతో సత్కరించి పూలబొకే అందించి హోళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తనను కలిసి హోళి శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ కంట్రోల్‌ సిస్టిమ్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వై. సంజీవ, ఉపాధ్యాక్షులు డి. వీరేష్‌, జాయింట్‌ కార్యదర్శి ఆర్‌. సుధాకర్‌ , ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కోశాధికారి నాగప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement