Friday, May 3, 2024

ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి.. వైఎస్ఆర్టీపీ కన్వీనర్

వికారాబాద్, ( ప్రభ న్యూస్): 2019లో నియామకం జరిగిన జూనియర్ గ్రామపంచాయతీ కార్తిష్ఠకు ప్రభుత్వ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గం కన్వీనర్ ఉప్పరి ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ గ్రామపంచాయతీ ఆదర్శ్లు ఏడవ రోజు సమయం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన వారికి మద్దతు పలికారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 2019లో నియామకం జరిగిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు వారికి చేయుతగా 10000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల జిల్లా కన్వీనర్ మధుకర్ రెడ్డి నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement