Saturday, April 27, 2024

నర్సరీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్‌..

మేడ్చల్‌ : రానున్న వర్షకాలంలో హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు మొక్కలను సిద్దం చేస్తున్నామని సర్పంచ్‌ జి. సురేందర్‌ముదిరాజ్‌ పేర్కోన్నారు. మండలంలోని గౌడవెల్లి గ్రామ పరిధిలో నర్సరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని నర్సరీలో వర్షా కాలానికి కావాల్సిన మొక్కల కోసం బ్యాగ్‌ పిల్లింగ్‌ పనులు చేపట్టినట్లు సర్పంచ్‌ సురేందర్‌ చెప్పారు. రానున్న రోజుల్లో హరిత హారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ప్రణాళికలను సిద్దం చేసినట్లు ఆయన వెల్లడించారు. హరితహారంలో గౌడవెల్లి గ్రామ పరిధిలో అనుకున్నదానికంటే ఎక్కవ మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సర్పంచ్‌ సురేందర్‌ ముదిరాజ్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement