Sunday, April 28, 2024

ఘనంగా వాసవీ మాత మండల పూజ

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల కేంద్రం లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత మండల పూజా సమాప్తి మరియు ఉద్యాపన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మహిళలు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహించారు 41 రోజులుగా ఆర్యవైశ్యుల ఇళ్లల్లో రోజు ఒకరి ఇంటి చొప్పున నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని లోక కళ్యాణార్థమై ఘనంగా పూజలు నిర్వహించారు.

ఆ తదనంతరం పట్టణ పరిధిలోని విఠలేశ్వర స్వామి ఆలయంలో భారీ ఎత్తున వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి చరిత్ర పారాయణము మరియు అష్టోత్తరము తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు బ్రాహ్మణోత్ములు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ తదనంతరం మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యంసాని ప్రకాష్ గుప్త ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమమును ఏర్పాటు చేయగా పూజా కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య బంధువులందరూ అన్న ప్రసాద వితరణలో పాల్గొని కార్యక్రమాలను పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రచార సమితి వ్యవస్థాపకురాలు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ జూలూరి స్వరూప రాణి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement