Friday, April 26, 2024

రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో భారీ అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్ – శాస్త్రిపురంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. కాలా పత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారి 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో.. సకాలంలో వారు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలం స్క్రాప్ గోడౌన్ గా గుర్తించారు. అయిదు ఫైరింజన్లతోని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ గోదాం కావడం.. ఎక్కువ మొత్తం స్క్రాప్ ఉండడంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. దీని చుట్టు పక్కల కూడా ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లు ఉన్నాయి. వీటికి మంటలు అంటుకోకుండా అదుపు చేస్తున్నారు..గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్థమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement