Monday, April 29, 2024

RR: ప్ర‌తి ఒక్క‌రు ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాలి… ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్, జనవరి 31 (ప్రభ న్యూస్): 35వ జాతీయ భద్రత వారోత్సవ సందర్భంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ర్యాలీని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ భద్రత అనేది కేవలం పోలీసులు మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరు ఉందని గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీ నర్సింలు, సిఐలు టంగుటూరు శ్రీను, వెంకటేశం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement