Monday, May 6, 2024

RR: వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ఆనంద్ సతీమణి ప్రచారం

వికారాబాద్, నవంబర్ 1 (ప్రభ న్యూస్): బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మేస్కో ఆనంద్ ను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి డాక్టర్ సబితా ఆనంద్ ఇవాళ ఉదయం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఆనంద్ ను రెండోసారి గెలిపించాలని ఆమె కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ లంకా పుష్పలత రెడ్డి, కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్, మేక పావని శేఖర్ రెడ్డి, రామస్వామి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు దత్తు శంకర్ రాము, విజయ్, నర్శిమ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement