Sunday, April 28, 2024

RR: తిమ్మాపూర్ లో బీజేపీ అభ్యర్థి అందె బాబయ్య ప్రచారం

షాద్ నగర్, నవంబర్ 4 (ప్రభ న్యూస్) : తిమ్మాపూర్ గ్రామంలో శనివారం ఉదయం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అందె బాబయ్య ముదిరాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దఎత్తున జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరారు.

రానున్నది మోడీ రాజ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి, జైపల్లి అశోక్ గౌడ్, నరసింహ గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement