Monday, April 29, 2024

TS | మానవ మనుగడకు దిక్సూచి భగవద్గీత.. 40 రోజుల బోధనలు పూర్తి

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : గీతా జ్ఞాన తరంగిణి సదాశివపేట వారి సౌజన్యంతో శంకర్ పల్లి సాయి కాలనీలోని పోచమ్మ ఆలయంలో శ్రీమద్ భగవద్గీత నిత్య తరగతులను ఆదివారం ఘనంగా పూర్తి చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా గీతా జ్ఞాన తరంగణి వారు మాట్లాడుతూ మానవ మనుగడకు దిక్సూచి లాంటిది భగవద్గీత అన్నారు.

శంకర్ పల్లి మహిళా మణులు ఈ సందర్భంగా మాట్లాడుతూ…. గీతా జ్ఞాన తరంగణి సదాశిపేట వారు చేపట్టిన ఈ మహా యజ్ఞంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అవకాశం ఉన్న మేరకు వారి సూచనలను పాటిస్తూ ఈ మహత్కార్యంలో మరింత ఉత్సాహంగా పాల్గొని శ్రీమద్ భగవద్గీత మాధుర్యాన్ని పదిమందికి చేర్చే లక్ష్యంతో పని చేస్తామని అభిప్రాయపడ్డారు. 40 రోజుల నుండి నిరంతరం పోచమ్మ ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సహకరించిన ఆలయ కమిటీకి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement