Sunday, April 28, 2024

AP | పవన్ కల్యాణ్ పై రాయితో దాడి.. తప్పిన ప్రమాదం

ఏపీలో సీఎం జగన్ పై శనివారం రాయి దాడి ఘటన మరువక ముందే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఓ వ్యక్తి ఆదివారం రాయితో దాడికి యత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని గుంటూరు జిల్లా తెనాలిలో ‘వారాహి యాత్ర’ చేపట్టారు. యాత్ర సాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై రాయి విసిరాడు. అయితే, అది ఆయనకు తగలకుండా కొద్ది దూరంలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పవన్ భద్రతా సిబ్బంది, జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

కాగా, శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఈ ఘటనపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు, జనసేనాని పవన్ పై కూడా రాయి దాడి జరగడంతో టెన్షన్ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement