Saturday, May 4, 2024

Warangal: బిజెపి నుండి రాణా ప్రతాప్ రెడ్డి సస్పెండ్..

వరంగల్ జిల్లా నర్సంపేట బిజెపి పార్టీ నుండి పలువురిని సస్పెండ్ చేసినట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం, కన్న తల్లి లాంటి పార్టీ కార్యాలయంపై మద్యం మత్తులో దాడి చేసిన గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, గడ్డం ఆంజనేయులు, చేపూరి నాగరాజు, తడుక అశోక్, పాలడుగు జీవన్ లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బిజెపి పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని పార్టీ తీసుకునే చర్యలకు ఎవరు అతీతులు కారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి శ్రీనివాస్ గౌడ్, మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement