Thursday, May 2, 2024

ADB : బీఆర్ఎస్‌లో చేర‌నున్న ర‌మాదేవి

బైంసా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు పి.రమాదేవి తన భారీ బలగంతో అధికారికంగా బీఆర్ఎస్ లో చేరబోతోంది. ఇవాళ‌ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె తన అనుచరగణం, మద్దతుదారులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనుంది.

ఇందు కోసం గాను భైంసాలోని తన నివాస గృహం నుంచి 150కి పైగా వాహనాల్లో వేయి మందికి పైగా తన శ్రేణులతో కలిసి ర్యాలీగా హైద రాబాద్ కు తరలివెళ్లింది. మాజీ ఎమ్మెల్సీ, ముథోల్ నియోజక వర్గ బీఆర్ఎస్ ఇన్చార్జీ పురాణం సతీష్ ఉదయం వేళలో రమాదేవి ఇంటికి వెళ్లి ఆమెను తీసుకొని హైద హైదరాబాద్ పయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement