Friday, May 17, 2024

Rahul vs Modi – లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే – బండి సంజయ్

కరీంనగర్ – ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదంతోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా 80 శాతానికిపైగా ప్రజలు మోదీనే మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగా ఈసారి ఢిల్లీకి వేసే ఓట్లన్నీ పువ్వు గుర్తుకేనని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలోనూ బీజేపీ 8 నుండి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు బాగోలేవని, ఉద్యోగుల జీతాలకు కూడా పైసల్లేవన్నారు. ఇగ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు సీఎం, మంత్రులు కొత్తగా ఇస్తున్న హామీల అమలు దేవుడెరగని చెప్పారు.

ఈరోజు కరీంనగర్ లోని శుభమంగళ గార్డెన్స్ లో బీజేపీ మండలాధ్యక్షులతోపాటు కొత్తగా ఎంపిక చేసిన మండల ఇంఛార్జీల సమావేశం జరిగింది. బండి సంజయ్ హాజరైన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇంఛార్జీలు మీసాల చంద్రయ్య, మోహన్ రెడ్డి, కరీంనగర్, రాజన్న జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement