Thursday, May 2, 2024

రోశయ్య మృతిపై సోనియా విచారం.. కుమారుడికి రాహుల్ ఫోన్

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆమె రోశయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. రోశయ్య మృతిపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు శివకు ఫోన్ చేసిన రాహుల్ గాంధీ.. తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి రోశయ్య మరణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement