Sunday, April 28, 2024

TS : యాదగిరిగుట్టకు భ‌క్తుల క్యూ…ద‌ర్శ‌నానికి 3గంట‌ల స‌మ‌యం..

ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో భ‌క్తులు యాద‌గిరి గుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకునేందుకు క్యూ క‌డుతున్నారు.
వేసవి కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. రద్దీ కారణంగా ఉచిత ధర్మదర్శనానికి 3 గంటల సమయం ప‌డుతుంది.

- Advertisement -

కాగా, ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ప్రదేశం..కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో వేసవి తాకిడికి ఇబ్బంది పడకుండా చలవ పందిరిళ్లతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement