Friday, May 3, 2024

CM KCR : ఖమ్మం, కొత్తగూడెంలో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు

గులాబీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు హాజరైన సీఎం కేసీఆర్‌ మూడోసారి ఖమ్మం, కొత్తగూడెంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రకాశం స్టేడియంలో అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలో ప్ర‌సంగించనున్నారు. ప్ర‌సంగం ముగించుకొని అక్క‌డి నుంచి హెలీకాప్ట‌ర్ ద్వారా కొత్తగూడెం వెళ్ల‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement