Sunday, April 28, 2024

Breaking: తెలంగాణ‌లో ప్రియాంక గాంధీ పర్యటన రద్దు

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యింది. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ క్యానిల్స్ అయినట్లు స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ వెల్లడించారు. కాగా, టీ కాంగ్రెస్ చేవెళ్లలో రేపు (మంగళవారం) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని టీపీసీసీ తెలిపింది. ఈ మేరకు సభకు ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.

ఈ సభలోనే ఆరు గ్యారెంటీల్లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లను ప్రియాంక గాంధీ చేత ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ రద్దు అయ్యింది. దీంతో రెండు పథకాల ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement