Friday, May 3, 2024

సూర్యాపేటలో బస్సు బోల్తా.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంల్లో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement