Thursday, April 25, 2024

సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. రూ. కోట్లలో అస్తి నష్టం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలోని అచ్చంపేట ద‌గ్గ‌రున్న 220/132 కేవీ ట్రాన్స్‌కో స‌బ్‌స్టేష‌న్‌లో 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా జిల్లాలోని కోన‌సీమ‌, రామ‌చంద్రాపురం, కాకినాడ ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాలోఅంత‌రాయం ఏర్పడింది. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అధికారుల చర్యలు చేపట్టారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం, న‌ర్సాపురం నుంచి కోన‌సీమ‌కు, రామ‌చంద్రాపురానికి బొమ్మూరు నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఏర్పాట్లు చేశారు. కాకినాడ‌కు పెద్దాపురం నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేశారు.  ప్ర‌మాదం జ‌రిగిన అర‌గంట‌లోనే విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement