Monday, April 29, 2024

HYD | శాంతి భద్రతల పరిరక్షణ‌ తొలి ప్రాధాన్యం.. జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్

హైదరాబాద్ (ప్ర‌భ‌న్యూస్‌): శాంతి భద్రతల పరిరక్షణ తొలి ప్రాధాన్యంగా ప‌నిచేస్తాన‌ని జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ అన్నారు. ఇవ్వాల (బుధవారం) ఆయన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానన్నారు. ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా నిర్భయంగా పోలీసు స్టేషన్ కు వ‌చ్చి ఫొర్యాదు చేయాలన్నారు.

కేసుల సత్వర పరిష్కరానికి కృషి చేస్తాన‌న్నారు ఏసీపీ హ‌రిప్ర‌సాద్‌. రౌడిసీటర్ల కు కౌన్సెలింగ్ ఇస్తూ, వారిని సన్మార్గంలో నడిచే విధంగా చూస్తాన‌ని చెప్పారు. నిత్యం పెట్రోలింగ్ చేస్తూ నేరాల నియంత్ర‌ణ‌కు ప్రయత్నం చేస్తానని, చైన్ స్నాచింగ్ వంటివి జరగకుండా తమ సిబ్బందికి సూచనలు ఇస్తామన్నారు. జూబ్లీహిల్స్ ను ఆదర్శంగా నిలిపేందుకు ప్రజలు, నాయకులు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement