Friday, April 26, 2024

ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద భారీగా మోహ‌రించిన పోలీసులు

317 జీవోను నిలిపివేయాలంటూ ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఇప్ప‌టికే బీఆర్కే భ‌వనం ముందు ఉపాధ్యాయులు ఆందోళ‌న చేస్తున్నారు. ఉపాధ్యాయులు త‌మ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. బ‌దిలీల విష‌యంలో వారు కొంత‌కాలంగా ఆందోళ‌న తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్‌, బేగంపేట‌లోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం, ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఉపాధ్యాయ‌, ఉద్యోగ సంఘాల స‌భ్యులు ప్రగతి భవన్ ముట్టడించే అవకాశం ఉండడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అక్క‌డ‌ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే అనుమానిత వాహ‌నాల‌ను పోలీసులు త‌నిఖీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement