Wednesday, May 15, 2024

Breaking: ఎస్సారెస్పీలో గ‌ల్లంతైన వ‌ల‌స కూలీలు.. మృత‌దేహాలు క‌నుగొన్న పోలీసులు

తోటి వలస కూలీని కాపడబోయి మరో కూలీ చ‌నిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా చందపల్లి శివారులో జ‌రిగింది. నిన్న‌ (ఆదివారం) ఛ‌తిస్‌గ‌ఢ్‌కు చెందిన వలస కూలీలు చందపల్లి శివారులోని ఎస్సారెస్పీ డి 83 కెనాల్ లో విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించే సమయంలో జారిపడ్డాడు. అత‌డిని రక్షించేందుకు మరో ఇద్దరు వలస కూలీలు కెనాల్ లో దూకారు. ఈ క్రమంలో కేతు సింగ్ మెరావి(27), ప్రహ్లాద్ మెరావి(35) గల్లంతయ్యారు.

ఈ సమాచారం అందుకొని సంఘటన స్థలానికి వెళ్ళిన పెద్దప‌ల్లి ఎస్సై రాజేష్ ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. దీంతో సోమవారం ఉదయం సంఘటన జరిగిన స్థలానికి కొద్ది దూరంలో వలస కూలీల మృతదేహాలు నీటిపై తేలాయి. మృతులు చందపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నారు. పొట్టకూటి కోసం వచ్చి వలస కూలిలు మృతి చెందడంతో పెద్దపల్లి లో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement