Friday, May 17, 2024

మంచిర్యాలలో గంజాయి దందా.. మత్తులో యువత!

మంచిర్యాల జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఈ మత్తుకు బానిసలైన వారు అక్రమార్కులతో చేతలు కలుపుతున్నారు. యువతను లక్ష్యంగా మత్తు దందాను కొనసాగిస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్న వారిలో  మైనర్లు ఉండటం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దండేపల్లిలోని కస్తూర్బా పాఠశాల వద్ద గంజాయి సేవిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఐదుగురు యువకులు పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరూ మైనరుగా వున్నారు. వారి నుంచి గంజాయిని స్వాధినం చేసుకున్నారు. తిర్యాని మండలంలోని జంగు అనే 70 సంవత్సరాల వృద్ధుని వద్ద నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు లక్షిటీపేట పట్టణం చెందినవారు కాగా, ముగ్గురు దండేపల్లి మండలం చెందిన వారిగా గుర్తించారు. ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement