Sunday, May 5, 2024

Bonalu: నీరుకుల్ల గ్రామంలో పోచమ్మ బోనాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్ (ప్రభ న్యూస్) : పెద్ద‌ప‌ల్లి జిల్లా సుల్తానాబాద్ మండ‌లంలో పోచ‌మ్మ బోనాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. మండలంలొని నీరుకుల్లలో ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లి దయ అందరిమీద ఉండాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వేడుకున్నారు.

నాలుగు రోజులుగా నీరుకుల్ల గ్రామంలో పోచమ్మ తల్లి భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి వంటి మహోత్సవ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు కలిసి ఇ సంతోషంతో చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చివరిరోజైన పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు నీరుకుల్ల గ్రామ డప్పు చప్పులతో ర్యాలీగా బయలుదేరి పోచమ్మ దేవాలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.

కార్య‌క్ర‌మంలో సర్పంచ్ కోటగిరి విజేందర్ తో పాటు జిల్లా రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి , ఎం పి పి బాలాజీ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపిటిసి శీలం శంకర్, సర్పంచ్ కొలిపాక అరుణజ్యోతి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్ రెడ్డి, పొన్నం సంపత్, అంజయ్య, చొక్కయ్య, మాజీ సర్పంచ్ బోయిని రాజ మల్లయ్య, వైకుంఠం, తెరాస నాయకులతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement