Sunday, May 5, 2024

PM Modi: తెలంగాణ‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌ షెడ్యూల్ ఖ‌రారు…

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ ప‌ర్య‌టన‌కు సంబంధించి షెడ్యూల్ ఖ‌రారైంది. ఈనెల 30వ తేదీన‌, అలాగే మే నెల 3, 4 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ధాని ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 30వ‌తేదీన ఆందోల్ లో మోడీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

అదే రోజు సాయంత్రం ఐటీ ఉద్యోగుల‌తో మోడీ స‌మావేశం కానున్నారు. మే 3న వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ప‌రిధిలో మోడీ స‌భ జ‌ర‌గ‌నుంది. భువ‌న‌గిరి, న‌ల్గొండ స్థానాల‌కు క‌లిపి మ‌రో స‌భ నిర్వ‌హించ‌నున్నారు. మే 4వ తేదీన నారాయ‌ణ‌పేట‌, వికారాబాద్ లో ప్ర‌ధాని మోడీ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement