Monday, May 6, 2024

TS : రేపు తెలంగాణలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌.. సిద్దిపేటలో బహిరంగ సభ

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేపు కేంద్ర‌మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. రేపు మధ్యాహ్నం సిద్దిపేటలో భారీ బహిరంగ సభ జరగనుంది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.

మే 13 వరకు నిర్మాణాత్మకంగా ప్రచారం సాగుతుందని.. మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారానికి మూడు లేదా నాలుగు సమావేశాలు జరగాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement