Monday, May 6, 2024

దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్య

దళితబంధు పథకంపై దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పైలెట్ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్ ను అత్యవరసంగా విచారించాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం.. లిస్ట్ ప్రకారం విచారిస్తామని, అప్పటి వరకు అగాలని పిటీషనర్ కు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement