Saturday, April 27, 2024

స్వైప్‌ మిషన్ పని చేయలేదని పెట్రో బాయ్ హత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలో HP పెట్రోల్ పంపులో పెట్రోల్‌ కోసం ముగ్గురు యువకులు ఒకే బైక్‌ పై వచ్చారు. అక్కడే వున్న బాయ్‌ వచ్చి వారి బైక్‌ లో పెట్రోల్‌ పోసాడు. అయితే ఆయువకుల్లో ఒకడు స్వైప్‌ కార్డు ఇచ్చాడు. అయితే బాయ్‌ స్వైప్ మిషన్ పనిచేయడం లేదు.. డబ్బులివ్వాలని కోరాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముగ్గురు యువకులు పంప్ బాయ్ సంజయ్ పై దాడి చేసారు. పిడు గుద్దుల వర్షం కురిపించారు. బాయ్‌ కిందపడి విలవిల లాడుతున్న పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడే ఉన్న కొందరు బాయ్‌ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. మార్గమద్యలోనే బాయ్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పెట్రోల్‌ పోసి డబ్బులు ఇవ్వమంటే ప్రాణాలే తీసేసారంటూ వాపోయారు. ఇలా అయితే మా పరిస్థితి ఏంటని? పగలు రాత్రి అని తేడాలేకుండా కుటుంబం కోసం కష్టపడుతుంటే మా మీదే ఇలా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తే మా కుటుంబాల పరిస్థితి ఏంటని తోటి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బాయ్‌ పై దాడి చేసిన దృష్యాలు సీసీ టీవీ కెమేరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీని అధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement