Thursday, April 25, 2024

పిల్లి పోయిందని కేసు పెట్టిన వ్యక్తి.. సీసీ కెమెరాలు చెక్ చేస్తోన్న పోలీసులు

పిల్లి పోయిందని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లోకేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి ఒక అరుదైన జాతికి చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. దానికి ఏమాత్రం లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. దానికి నోమనీ అనే పేరు పెట్టుకున్నాడు. దీని వయసు 18 నెలలు. ఈ పిల్లి కళ్లలో ఒకటి గ్రీన్, మరొకటి బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ పిల్లి ప్రత్యేకత ఇదే. దీన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఎత్తుకుపోయారు. దీంతో, తన పిల్లిని ఎత్తుకుపోయారంటూ మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement