Thursday, April 25, 2024

పెళ్లి భరాత్​లో ఘోరం.. డ్రైవింగ్​ రాకున్నా కారు నడిపిన వరుడు, 13 ఏళ్ల బాలుడు మృతి

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఘోరం జరిగింది. గట్టుప్పల్ గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుంటే వారిమీదికి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా గట్టుప్పల్​ సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన మల్లేష్‌ అనే వ్యక్తి వివాహ వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. 29 సెకన్ల నిడివి గల వీడియోలో వరుడి స్నేహితులు ఏర్పాటు చేసిన రహదారిపై వ్యక్తులు DJలో డ్యాన్స్ చేస్తుంటే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

పెళ్లి ఊరేగింపు ముందు నడుస్తుండగా వరుడి కారు వారిని అనుసరించింది. అయితే ‘బారాత్’ను ఎంజాయ్ చేసేందుకు కారు డ్రైవర్ దిగాడు. దీంతో డ్రైవింగ్ తెలియక పోయినా వరుడు కారు నడిపేందుకు​ ట్రై చేశాడు. దీంతో కొద్దిసేపటికే కారు అదుపు తప్పి పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 ఏళ్ల దుబ్బాక సాయిచరణ్‌ చనిపోయాడు. ఈ ప్రమాదంలో వరుడితో పాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మరోవైపు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement