Friday, April 26, 2024

ఆధ్యాత్మిక చింత‌న‌తోనే మాన‌సిక ప్ర‌శాంత‌త.. జ‌గ‌న్

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత పొందుతారని కార్పొరేటర్ జగన్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో మైసమ్మ నగర్ లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో 5వ కల్యాణోత్సవంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… అమ్మవారందరినీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మైసమ్మ నగర్, కమిటీ అధ్యక్షులు హనుమంతు, కుర్మా రెడ్డి, రాజశేఖర్ చారి, పాపి రెడ్డి అప్పి రెడ్డి, చంద్రయ్య, రాజు గౌడ్, వెంకటేష్, ఎర్ర లక్ష్మయ్య, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement