Thursday, April 25, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్..

న‌ష్టాల్లో ముగిశాయి దేశీయ‌ స్టాక్ మార్కెట్లు..రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో తదితర కంపెనీలు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 396 పాయింట్లు నష్టపోయి 60,322కి పడిపోయింది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 17,999కి దిగజారింది. ఆటొమొబైల్స్ సూచీ రెండున్నర శాతం వరకు నష్టపోయింది.మారుతి సుజుకి (7.31%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.44%), టెక్ మహీంద్రా (1.43%), బజాజ్ ఫైనాన్స్ (0.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.24%).బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.టాప్ లూజర్స్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.31%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.05%), ఎన్టీపీసీ (-2.01%) నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement